33.2 C
Hyderabad
May 11, 2024 12: 22 PM
Slider ప్రత్యేకం

సీఎం జగన్ పర్యటనకు ఏర్పాట్లు పూర్తి

#majjisrinivasarao

విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం భోగాపురం మండలం సవరవిల్లి వద్ద 3వ తారీఖున సీఎం జగన్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న నేపథ్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. శంకుస్థాపన కార్యక్రమం, భారీ బహిరంగ సభ ఏర్పాట్లను నేడు జిల్లా పరిషత్ చైర్మన్, విజయనగరం జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) పర్యవేక్షించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రోగ్రాం కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం , జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్, ఎస్పీ దీపిక పాటిల్ , జాయింట్ కలెక్టర్ మయూరి అశోక్, ఆర్డీవో సూర్య కళ పాల్గొన్నారు. అనంతరం మజ్జి శ్రీనివాసరావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీఎం జగన్ ఘనంగా స్వాగతించేందుకు ఏర్పాట్లు అన్ని పూర్తి చేశామని తెలిపారు. మే 3వ తారీకు ఉత్తరాంధ్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుందని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, చింతపల్లి ఫ్లోటింగ్ జట్టి మరియు రామ్ తీర్థ సాగర్ పనులకు ముఖ్యమంత్రి  శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు.

తెలుగుదేశం నాయకులు ఎన్నికలకు రెండు నెలల ముందు శంకుస్థాపన అని హడావిడి చేసి ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేశారని అన్నారు. కానీ సీఎం జగన్ చిత్తశుద్ధితో కోర్టులో అడ్డంకులను అన్ని తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు తీసుకున్నాకే శంకుస్థాపనకు ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. మరో మూడు సంవత్సరాల్లో ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని పూర్తి పూర్తిచేసుకుని ఉత్తరాంధ్ర ప్రజల కలను కలను సాకారం చేస్తున్నారని మజ్జి శ్రీనివాసరావు అన్నారు.

Related posts

అంబేద్కర్ జయంతి వేడుకలకు ఏర్పాట్లు

Bhavani

డిసెంబర్ 23న నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ “18 పేజీస్”

Bhavani

గులాబీ తుపాన్…ప్రభావిత ప్రాంతాల్లో సీఎస్ ఆదిత్యనాధ్ పర్యటన..!

Satyam NEWS

Leave a Comment