రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర రాజన్ నాగర్ కర్నూల్ జిల్లా అప్పాపూర్ పర్యటనకు కావలసిన అన్ని ముందస్తు ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో గవర్నర్ పర్యటన ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ కె. మనోహర్ తో కలిసి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యటన సందర్బంగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. అప్పాపూర్ లో సమావేశ వేదిక, సౌండ్ సిస్టమ్, విద్యుత్, ప్రోటోకాల్ తదితర ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎస్పీ కె. మనోహర్, అదనపు కలెక్టర్ రాజేష్ కుమార్, డి.ఎఫ్.ఓ కిష్టా గౌడ్, పి.ఓ. ఐ.టి.డి.ఏ అశోక్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.