రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం లోని కాచిగూడ లో జరిగిన బిసి యువజన సంఘం మహాసభలో బిసి విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శి,విన్నపం ఒక పోరాటం అధ్యక్షురాలు చీకూరి లీలావతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బిసి లో కొన్ని కులాలకే లక్ష రూపాయలు వచ్చే విధంగా ప్రకటించి మిగిలిన కులాలను పక్కన పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.ఎన్నికల సమయంలో మాత్రమే బిసి లు గుర్తుకొస్తున్నారని,ఎక్కడాలేని కపట ప్రేమను ప్రదర్శిస్తున్నారని అన్నారు. స్కూళ్లలో,కాలేజీలలో ఉద్యోగ నియామకాలు జరగాలని,ప్రైవేట్ స్కూళ్ళు, కాలేజీలలో ఫీజులు నియంత్రణ చేసే విధంగా ప్రభుత్వం తగిన చర్య తీసుకోవాలని,బిసి ల యువజన సంఘం ఇంకా బలంగా పుంజుకోవాలని చీకూరి లీలావతి కోరారు.
సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్