29.7 C
Hyderabad
May 4, 2024 04: 12 AM
Slider విజయనగరం

అక్రమ అరెస్టు కు వ్యతిరేకంగా “బాబు తో బ్రాహ్మణులు”

#brahmin

ఉభయ రాష్ట్రాల్లో బ్రాహ్మణులు… గళమెత్తుతున్నారు. అటు తెలంగాణ రాష్ట్రం ఇటు ఏపీలో కూడా బ్రాహ్మణులంతా ఒక్క తాటిపైకి వచ్చేందుకు నడుము బిగించారు. అందులో భాగంగా… రాజకీయాల నేతల అండదండలు కలిసి రావడం శుభపరిణామం అని అంటోంది……”సత్యం న్యూస్. నెట్”.ఈ నేపథ్యంలో చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ.. విజయనగరం లో ” బాబు తో బ్రాహ్మణులు” అంటూ విజయనగరం లో బ్రాహ్మణులు అంతా నగరంలో మూడులాంతర్ల వద్ద ఆనంద్ గ్రాండ్ హోటల్ లో ఉదయం 10 నుంచీ సాయంత్రం 5 గంటల వరకు రిలే నిరాహార దీక్ష చేపట్టారు.

ఈ దీక్ష శిబిరానికి కేంద్ర మాజీమంత్రి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు ,సీనియర్ నేత అశోక్ గజపతి రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ.. అసలు ఈ ప్రభుత్వ హాయాంలో ఏ ఒక్కరూ సజావుగా తమ తమ విధులు, పనులు నిర్వర్తించలేక పోతున్నారు. ప్రజా స్వామ్య విలువలను కాలరాసారని ఆరోపించారు. అందుకు సాక్షమే…మాజీ సీఎం ను ఎలాంటి ఆధారాలు లేకుండా.. అన్యాయం గా అరెస్ట్ చేసి జైల్లో పెట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు.

కనీసం ఈ విధంగా నైనా… ప్రభుత్వ చర్యలను ఖండించాలని…. కోరుతూ మీరంతా ఈ రిలే నిరాహారదీక్ష చేపట్టడం శుభపరిణామం  అని అశోక్ గజపతి రాజు అన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నేతలు ఐవీపీ రాజు, ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్, బొద్దుల నరసింగరావు, వడ్లమాని సుభద్ర, బ్రాహ్మణ వేత్తలు రాకేష్ శర్మ..సుబ్రహ్మణ్యం, నందివాడ వేణుగోపాల్, తదితరులు పాల్గొన్నారు.

Related posts

రామోజీరావు ఏం చేయబోతున్నారో?

Satyam NEWS

కె.పి.ఆర్. తో మీరు కుమ్మకైయ్యారా ? నేను కుమ్మకైయానా?

Satyam NEWS

తండ్రి మరణించిన పది రోజులకే కొడుకు దుర్మరణం

Satyam NEWS

Leave a Comment