Slider నల్గొండ

మేడే వేడుకలను జయప్రదం చేయండి: సి ఐ టి యు

#mayday

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు కామ్రేడ్ మల్లు స్వరాజ్యం సంస్మరణ సభ ఈ నెల 29న, సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరుగుతుందని,ఈ సభకు పెద్ద ఎత్తున కార్మిక వర్గం కదిలి రావాలని జిల్లా సిఐటియు ఉపాధ్యక్షుడు శీతల రోషపతి,భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి యలక సోమయ్య గౌడ్ కోరారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని శిల్పకళ బిల్డింగ్ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం సిఐటియు పట్టణ కమిటీ సమావేశం ఉప్పతల వెంకన్న అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రోషపతి, సోమయ్య గౌడ్ మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పెట్రోలు, డీజిల్,వంటగ్యాస్ ధరలను విపరీతంగా పెరగటంతో నిత్యావసర ధరలు  పెరిగాయని,సామాన్యుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆరోపించారు. కార్మిక చట్టాల సవరణ, నాలుగు లేబర్ కోడ్ లని రద్దు చేయాలని,ప్రతీ సంఘం కార్మిక దినోత్సవ మేడే వేడుకలను విజయవంతం చేయుటకు కార్మికులందరూ కదిలి మే ఒకటో తేదీన జరిగే ప్రదర్శనలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కార్మికులు కోరారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు కమిటీ పట్టణ కమిటీ సభ్యులు గుండెబోయిన వెంకన్న,పిహల్ రాకేష్,నాగేశ్వరరావు, శ్యామ్,వెంకన్న,సైదులు,వీరస్వామి, తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

ప్రాధేయ పడితేనే పర్మిషన్ అడుక్కుంటే నే అనుమతి

Satyam NEWS

అన్ని పనులు డిసెంబర్ 31 లోగా పూర్తి చేయాలి

Murali Krishna

రోడ్డు ప్రమాదంలో అక్కాతమ్ముడు మృతి

Satyam NEWS

Leave a Comment