28.7 C
Hyderabad
April 27, 2024 06: 08 AM
Slider మహబూబ్ నగర్

మదారి కురువ మదాసి కురువ వనపర్తి జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక

#madasikuruma

వనపర్తి పట్టణం లో గల MYS ఫంక్షన్ హాల్ లో  జరిగిన కార్యవర్గ సర్వసభ్య సమావేశంలో వనపర్తి జిల్లా  మదారి కురువ మదాసి కురువ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో వనపర్తి జిల్లాలోని పదనాలుగు మండలాల మదాసి, మదారి కురువ కులస్తులు పాల్గొని జిల్లా అధ్యక్షులుగా  మోటురి తిరుపతయ్యను, ప్రధాన కార్యదర్శిగా కిల్లె వెంకటయ్యను, జిల్లా కోశాధికారిగా మదాసి కురువ బిచ్చన్న ను ఎన్నుకోగా, నియోజకవర్గం అధ్యక్షులు గా గోపాల శివశంకర్ ను, ప్రధాన కార్యదర్శిగా నాగరాములు ను, కోశాధికారి గా శ్రీశైలంను ఎన్నుకున్నారు.

ఈ ఎన్నిక కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు సత్య స్వరూప్ ముఖ్యఅతిథిగా పాల్గొనగా, ప్రత్యేక అతిథిగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల కుల సంఘ సమన్వయకర్త డాక్టర్ మురహరి బుద్ధారం పాల్గొన్నారు. వీరితో పాటు ఈ ఎన్నికకు రాష్ట్ర ముఖ్య నాయకులు రామ్ కుమార్ ప్రధాన కార్యదర్శి పెద్ద మల్లయ్య, ఉపాధ్యక్షులు బోరింగ్ శ్రీనివాసులు, విజ్జఫ్ఫ, జాయింట్ సెక్రటరీ తిక్కన్న, రాష్ట్ర ముఖ్య నిర్వాహక సభ్యులు దర్గా వెంకటేష్, మదాసి కురువ పల్లయ్య, సాంస్కృతిక విభాగం అధ్యక్షులు సొంటే ఎల్లయ్య, మహిళా విభాగం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు శరణ్య, ప్రధాన కార్యదర్శి పుష్ప, అలాగే నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు బొంగర్ల లింగం, జిల్లా ఉపాధ్యక్షలు పర్వతాలు, నాగర్ కర్నూల్ నియోజకవర్గం అధ్యక్షులు శ్రీనివాసులు, కొల్లాపూర్ నియోజకవర్గం అధ్యక్షులు శారదా లోకేష్ మరియు ఉమ్మడి జిల్లా నాయకులు, తదితర కులస్తులు పాల్గొన్నారు.

Related posts

కొత్త మంత్రుల పేర్లు దాదాపు ఖరారు: ఇదే లిస్టు

Satyam NEWS

సంత్ సేవాలాల్ మహరాజ్ యువతకు ఆదర్శప్రాయుడు

Satyam NEWS

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు కోర్టు సమన్లు

Satyam NEWS

Leave a Comment