హైదరాబాద్ లో ఉదయం తెలంగాణ ప్రభుత్వ అధికార నివాసం ప్రజా భవన్ లో బీసీ, ఎస్సీ, ఎస్టీ,మైనార్టీల ఆశాజ్యోతి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను వనపర్తి అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు, కాంగ్రెస్ మాజీ కౌన్సిలర్ సతీష్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి సన్మానం చేశారు. ఈ సందర్భంగా వారితో ఇంతకుముందు ఉన్న పరిచయాలను గుర్తు చేసుకుంటూ వారి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయినా మేము రాబోయే లోకసభ ఎన్నికలలో మాజీ ఎంపీ డాక్టర్ మల్లు రవిని పెద్ద మెజారిటీ తో గెలిపించాలని కోరారు. అందరూ జాగృతం కావాలని ఆయన చెప్పారు. అలాగే ఐక్యవేదక చేసిన కార్యక్రమాలు అడిగి తెలుసుకుని అభినందించారు.ఈ కార్యక్రమంలో సతీష్ యాదవ్ తో పాటు కాంగ్రెస్ పార్టీ కో ఆర్డినేటర్ గడ్డం శ్రీనివాసులు, శివకుమార్,రాములు,కళ్యాణ్,భరత్ పాల్గొన్నారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్