ప్రశ్నించే ప్రజాగొంతుక తీన్మార్ మల్లన్నపై ప్రభుత్వం పెట్టిస్తున్న అక్రమ కేసులను నిరసిస్తూ ఈరోజు హన్మకొండలోని ప్రెస్ క్లబ్ లో ఉమ్మడి జిల్లా స్థాయి అఖిలపక్ష సమావేశానికి ములుగు జిల్లా కన్వీనర్ మొగుళ్ల భద్రయ్య ఆధ్వర్యంలో జిల్లా నుంచి టీమ్ సభ్యులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ములుగు జిల్లా టీమ్ సభ్యులు మాట్లాడుతూ అవినీతి, అక్రమాలను నిలదీస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న మల్లన్నను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ములుగు జిల్లా కమిటీ సభ్యులు మార్త శ్రీనివాస్, బుర్రి దేవేందర్, ములుగు మండల కన్వీనర్ పోరిక రాహుల్ నాయక్, కొకన్వీనర్ శనిగరపు ప్రవీణ్, వెంకటాపూర్ మండల కన్వీనర్ అక్కపెల్లి అరవింద్, కొకన్వీనర్ దొమ్మటి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.