ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్గా జస్టిస్ వి.కనగరాజ్ నియమితులయ్యారు. ఆయన నేడు యుద్ధ ప్రాతిపదికపై పదవి బాధ్యతలు స్వీకరించారు. జస్టిస్ వి.కనగరాజ్ మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. జస్టిస్ వి.కనగరాజ్ దాదాపు తొమ్మిదేళ్లపాటు హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు.
స్టేట్ ఎలక్షన్ కమిషనర్ హోదాలో రిటైర్డ్ హైకోర్టు జడ్జిని నియమించేలా ఆర్డినెన్స్ను తీసుకువచ్చిన ప్రభుత్వం, ఆర్డినెన్స్ ప్రకారం జస్టిస్ వి.కనగరాజ్ నియామకం చేసింది. జస్టిస్ వి.కనగరాజ్ విద్య, బాలలు, మహిళల, వృద్ధుల సంక్షేమ అంశాలకు సంబంధించి కీలక తీర్పులు ఇచ్చారు.