మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్పై ఫేస్బుక్లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు ఓ మహిళను ముంబై సైబర్ క్రైమ్ విభాగం పోలీసులు అరెస్ట్ చేశారు. థానే నివాసి అయిన ఈ మహిళ తన గుర్తింపును దాచడానికి నకిలీ ప్రొఫైల్ను సృష్టించి ఈ పోస్ట్ చేసింది. అయితే ఆమెను గుర్తించిన పోలీసులు ఆమెపై ఐపీసీ, ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
పోలీసులు ఆమెను కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి ఆమెను సెప్టెంబర్ 15 వరకు పోలీసు కస్టడీకి పంపారు. అందిన సమాచారం ప్రకారం, ఈ మహిళ ఫేస్బుక్లో నకిలీ పేరుతో ప్రొఫైల్ తయారు చేసి, సెప్టెంబర్ 7న అమృతా ఫడ్నవీస్ పై ఫేస్బుక్ లోఒకదాని తర్వాత ఒకటిగా 4 వ్యాఖ్యలు పెట్టింది.
ఈ కేసులో ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు, ఈ విషయంలో గుర్తు తెలియని వ్యక్తిపై ఐపీసీ సెక్షన్ 67తో పాటు సెక్షన్ 419, 468, 469, 504, 505 (1)(సి), మరియు 509 కింద ఫిర్యాదు నమోదు చేశారు. ఐటీ చట్టంలోని 66(డి) కేసు నమోదు చేస్తూనే అన్వేషణ ప్రారంభించారు.
పోలీసుల విచారణలో ఈ వ్యాఖ్య చేసిన మహిళ వేరే ఐపీ అడ్రస్ను వాడినట్లు తేలింది. తన గుర్తింపును దాచుకునేందుకు గణేష్ కపూర్ పేరుతో ఫేస్బుక్లో నకిలీ ప్రొఫైల్ను సృష్టించింది. పోలీసులు మళ్లీ అక్కడికి చేరుకుని ఆమెను అదుపులోకి తీసుకున్నారు.