తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని డాక్టర్ ఏఎస్ రావ్ నగర్ డివిజన్ కార్పొరేటర్ పావని మణిపాల్ రెడ్డి మాస్కులు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఇంటి వద్ద టీఆర్ఎస్ జెండా ఆవిష్కరించిన అనంతరం వంద మాస్కులు పంచి పెటారు.
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా అందరూ లాక్ డౌన్ నిబంధనలకు కట్టుబడి ఉండాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ డివిజన్ ప్రెసిడెంట్ బేతాళ బాలరాజు సెక్రెటరీ సురేందర్ నాయకులు మణిపాల్ రెడ్డి, గోవర్ధన్ సాయిరెడ్డి అనీష్ భాషా టింకు తదితరులు పాల్గొన్నారు.