29.7 C
Hyderabad
May 2, 2024 05: 45 AM
Slider నల్గొండ

అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి కృషి చేస్తా

#SanampudiSaidireddyMLA

నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి చేస్తానని శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం గరిడేపల్లి మండలం గానుగబండ గ్రామంలో ఈద్గా నిర్మాణానికి 0.20 కుంటల స్థలాన్ని ఇప్పించి ఈద్గా నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు.

అనంతరం గ్రామంలో 20 లక్షల రూపాయల DMFT నిధుల ద్వారా మంజూరు అయిన CC డ్రైనేజి పనులకు శంఖుస్థాపన చేశారు. వివిధ పార్టీల నుండి సుమారు 100 మంది కార్యకర్తలు సైదిరెడ్డి  సమక్షంలో పార్టీ చేరారు.

ఈ సందర్భంగా సైదిరెడ్డి మాట్లాడుతూ తనను అఖండ మెజార్టీతో గెలిపించిన అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి  ఎల్లప్పుడూ అండగా ఉంటానని అన్నారు.

ప్రభుత్వ సంక్షేమాల పథకాలు నచ్చే కార్యకర్తలు పార్టీలో చేరుతున్నారని అన్నారు. గ్రామంలోని పాండవుల గుడి, కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కృషిచేస్తా అన్నారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకటరెడ్డి, ఎంపీపీ పెండెం సుజాత శ్రీనివాస్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు జోగు అరవింద రెడ్డి, ప్రధాన కార్యదర్శి మన్సూర్ అలీ, గ్రామ సర్పంచ్ పంగ వీరస్వామి, ఎంపీటీసీ మీరా, గ్రామ శాఖ అధ్యక్షుడు సతీష్ రెడ్డి, మాజీ సర్పంచ్ గురవయ్య,  సయ్యద్ హుస్సేన్, అంజి తదితరులు పాల్గొన్నారు.

Related posts

భావి భారత పౌరులకు అంబేద్కర్ ఆదర్శం

Sub Editor

వ్యయంపైనే అనుమానాలు

Murali Krishna

సహకార వ్యవస్థ బలోపేతమే రైతుకు అదనపు బలం

Satyam NEWS

Leave a Comment