వచ్చే నెలలో జరగబోవు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లు, నమోదుకు సంబందించిన విధి విధానాలపై అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా సమావేశం నిర్వహించారు.
శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు, ఓటర్ల నమోదు విషయాలపై ఆమె మాట్లాడారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో జనవరి 22, 2021 వరకు నమోదు అయిన డిగ్రీ పూర్తి చేసిన పట్టభద్రుల ఓటర్లు మొత్తం 20,669 మంది నమోదు చేసుకున్నారని ఆమె అన్నారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని అన్ని పార్టీల ప్రతినిధులకు ఆమె సూచించారు.
ఈ సమావేశానికి అదనపు జిల్లా కలెక్టర్ డి.వేణుగోపాల్, ఆర్.డి.ఓ.అమరేందర్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి