కరోనా కష్ట కాలంలో తర్వాతి స్టేజిలో మానసిక సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నా పాలకులు ఎవరూ ఆ దిశగా ఆలోచించడం లేదు. ఇప్పుడు అలాంటి మానసిక సమస్యలతో ఒక ఆటో డ్రైవర్ మరణించాడు. ఈ విషాద సంఘటన విశాఖపట్నంలోని ఆరిలోవ శ్రీకాంత్ నగర్ లో నేడు చోటు చేసుకుంది.
ఈ రోజు ఉదయం భూతల శ్రీను మహేష్(48)అనే వ్యక్తి నలుగంతస్థుల బిల్డింగ్ మీది నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతను ఆటో డ్రైవర్ గా పనుచేస్తుంటాడని, కరోనా నేపథ్యంలో ఆర్ధిక ఇబ్బందులు తట్టుకోలేక, ఆటో ఈ ఎం ఐ కూడా కట్టలేని పరిస్థితిలో మానసికంగా కృంగిపోయి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.
ఆరిలోవ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.