స్కిట్ పై లేనిపోని అసత్య ప్రచారాలు చేస్తున్నారని ప్రిన్సిపాల్ రజనీకాంత్ తెలిపారు. ఈ కళాశాలలో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్లు G.సరోజిని, S.నరసింహారావు, M.విజయలక్ష్మి, P.ఉమామహేశ్వరి, P.రవికిరణ్, A.లక్ష్మినారాయణ లు దొంగ డిగ్రీలు సంపాదించారని నిరాధారమైన అభియోగం చేశారు. అవి కేవలం SKITT కళాశాల ప్రతిష్టను దిగజార్చడానికి, భ్రష్టుపట్టించడానికి పన్నిన పన్నగం మాత్రమే అని ప్రిన్సిపాల్ అన్నారు. వారి డిగ్రీలు నిజమైనవే అనడానికి జవహార్ లాల్ నెహ్రు టెక్నాలజీ యూనివర్శీటి అనంతపురం వారు ఇచ్చిన సర్టిఫికేట్ ఆధారం అన్నారు. అంతేకాక గవర్నర్ చేతుల మీదుగా గోల్డెమెడల్ సంపాదించిన అధ్యాపకులు కూడా ఉన్నారని కళాశాలపై తప్పుడు ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు.
previous post