వచ్చే లోక్సభ ఎన్నికల్లో భాజపాతో కలిసి పనిచేసే విషయంపై జనతాదళ్ (సెక్యులర్)తో అంగీకారం కుదిరినట్లు ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప వెల్లడించారు.‘భాజపా, జేడీఎస్లు ఓ అవగాహనకు వచ్చాయి. వచ్చే లోక్సభ ఎన్నికల్లో జేడీఎస్కు నాలుగు సీట్లు ఇచ్చేందుకు భాజపా అగ్రనేత అమిత్ షా అంగీకరించారు.
ఇది తమకెంతో బలాన్ని ఇవ్వడంతోపాటు రాష్ట్రంలో 25-26 స్థానాల్లో గెలుపొందేందుకు దోహదపడుతుంది’ అని మాజీ ముఖ్యమంత్రి, భాజపా పార్లమెంటరీ బోర్డు సభ్యుడు బీఎస్ యడియూరప్ప పేర్కొన్నారు.