కడప ఎంపీ అవినాష్ రెడ్డికి ఈ రోజు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. వైఎస్ వర్ధంతి సందర్భంగా సెప్టెంబర్1,2 వతేదీలలో కడప జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటించనున్నారు.
ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, మీడియా ప్రతినిధులు అందరికీ కరోనా నిర్దారణ పరీక్షలు చేశారు. ఈ పరీక్షల లో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది.
తనకు కరోనా అని నిర్ధారణ కావడంతో వెంటనే ఎంపీ హోమ్ ఐసోలేషన్ కు వెళ్ళిపోయారు. అయితే కొద్ది రోజులుగా అయనతోనే కలిసి తిరుగుతున్న అనుచరులతో ఆందోళన నెలకొంది.