చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు అంశంలో జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతి, ప్రధాన మంత్రి,కేంద్ర హోం శాఖ మంత్రులకు ఎంపి కేశినేని అధికారికంగా లేఖ రాశారు. మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ విషయంలో వెంటనే జోక్యం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, న్యాయాన్ని, న్యాయాన్ని, పౌర హక్కులను,రక్షించాలని భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రిలను,కేంద్ర హోమ్ శాఖలను కోరుతున్నామని ఆయన అన్నారు.
రాజకీయ ప్రేరిపితమైన అంశాలతో సరైన ఆధారాలు లేకుండా అక్రమంగా అరెస్టు చేశారని కేసినేని వ్యాఖ్యానించారు. 45 ఏళ్ళు నిస్వార్థ ప్రజా సేవ చేసి నీతి నిజాయితీలకు మారు పేరుగా ఉన్న చంద్రబాబు నాయుడుపై ఈ విధమైన పైచాచిక చర్యలను పార్టీలకు అతీతంగా ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలి. తన తండ్రిని కలవటానికి కూడా వెళ్లకుండా నారా లోకేష్ ను అడ్డుకునే హక్కు పోలీసులకు ఏ రాజ్యాంగం కల్పించింది. ప్రజలు , తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడుకి అండగా నిలబడి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుటాం. టిడిపి నాయకులు కార్యకర్తలను నిర్బంధించినంత మాత్రాన ప్రభుత్వం పోలీసులు విజయం సాధించినట్లు కాదు అని కేసినేని నాని అన్నారు.