మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు తన నిస్వార్థమైన సేవతో ప్రజల గుండెల్లో ఎల్ల కాలం నిలిచి ఉంటారని విజయనగరం జిల్లా కలెక్టర్ డా. ఎం.హరి జవహర్ లాల్ పేర్కొన్నారు.
కలక్టరేట్ ఆడిటోరియం లో నేడు అల్లూరి జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తొలుత అల్లూరి చిత్రపటానికి పూల మాలలు వేశారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ తెల్ల దొరలను ఎదిరించిన ధైర్యవంతుండన్నారు. ఇలాంటి దేశ భక్తుల గురించి భావితరాల వారికి తెలిసేలా చేయాలన్నారు.
గిరిజనుల హక్కుల కోసం పోరాటం చేసారన్నారు. వారి ఆశయ సాధన లో పని చేసి బలహీన వర్గాల కు మేలు జరిగేలా చూడాలని అన్నారు.
ఈ కార్యక్రమం లో సంయుక్త కలెక్టర్లు డా.జి.సి.కిషోర్ కుమార్, జె.వెంకట రావు, డి.ఆర్.ఓ గణపతి రావు, కలక్టరేట్ ఏ. ఓ , సిబ్బంది పాల్గొన్నారు.