దాసన్నపేట జంక్షన్ లో పనులకు స్థానిక ఎమ్మెల్యే శంకుస్థాపన…!
ప్రజల భాగస్వామ్యంతోనే విజయనగరం మరింత గాఅభి వృద్ది పదంలోని వెళుతోందని స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ఈ మేరకు నగరంలోని దాసన్న రైతు బజార్ జంక్షన్..క్షత్రియుల సహకారంతో అల్లూరు సీతారామారాజ విగ్రహ ఏర్పాటు పనులకు ఎమ్మెల్యే కోలగట్ల శంకుస్థాపన చేసారు. ఈసందర్బఃంగా ఎమ్మెల్యే కోలగట్ల మాట్లాడుతూ…నగరంలో ప్రజల బాగస్వామ్య పద్దతిలో పలు కూడళ్లను ఆధునీకరణతోపాటు అభివృద్ది పధంలోకి తీసుకువస్తున్నామన్నారు. అలాగే పలు శాఖలపనుల్లో పబ్లిక్,ప్రైవేటు,భాగస్వామ్యం(పీ.పీ.ఏ)తో అబివధ్ది కార్యక్రమాలు చేపడుతున్నమన్నారు.తాజాగా మన్యం వీరుడు,స్వాతంత్ర్యోద్యమ కారుడు,విప్లవజ్యోతి స్వర్గీయ అల్లూరి సీతారామారాజు పొరుగు జిల్లాలోనిఅందునా విజయనగరం జిల్లాకుదగ్గరలో అదీ రేగిడి,పద్మనాభం మద్యంలో జన్మించడం అందరం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. అందులో భాగంగాను మున్సిపల్ కార్పొరేషన్ పరిదిలో అదీ దాసన్న పేట రైతు బజార్ జంక్షన్ లో ఆయన పేరిట విగ్రహం ఏర్పాటుపనులకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు.ఇందుకు ఫోర్ట్ సిటీ స్కూల్ యజమాని శివ సహకారంతో అల్లూరి విగ్రహ ఏర్పాటు పనులుకు ప్రారంభం చేసామన్నారు. ఈ పనులే కాకనగరంలో పలు ప్రాంతాలలో జరుగుతున్న అభివృద్ది పనులు…ప్రజలు,ప్రముఖ సంస్థలు,దాతాల సహకారంతో చేపడుతున్నామన్నారు. అంతిమంగా ప్రజలు బాగుపడాలని…ఆ ఉద్దేశ్యంతో వైఎస్ఆర్పీపీ రాష్ట్ర అధ్యక్షుడు,సీఎం జగన్..నవ రత్నాలను అమలులోకి తీసుకువచ్చారన్నారు.ఈ కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి, క్షత్రియ పరిషత్ నేతలు సాగి శివసీతారామారాజు,హోటల్ బాలాజీ యజమాని, అలాగే ఫోర్ట్ సిటీ అధినేత శివ స్థానిక కార్పొరేటర్లు కమీషనర్ వర్మ లుపాల్గొన్నారు.
!