27.7 C
Hyderabad
May 7, 2024 07: 59 AM
Slider ఖమ్మం

వ్యక్తుల కంటే పార్టీకే ప్రాముఖ్యత

party is more important than the persons

కార్యకర్తలను, నాయకులను కలుపుకొని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, వ్యక్తుల కంటే పార్టీకే ప్రాధాన్యత ఇవ్వాలని ఖమ్మం జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధు పేర్కొన్నారు.  మధిర మండలం పరిధిలోని దేశినేని పాలెం గ్రామంలో టిఆర్ఎస్ నాయకులు ఆత్మ కమిటీ చైర్మన్ కోటేశ్వర రావు ను పరామర్శించిన  అనంతరం  కార్యకర్తలతో నాయకులతో కొద్దిసేపు ముచ్చటించారు. నాయకులు పార్టీ బలోపేతానికి కార్యకర్తలు అందర్నీ కలుపుకొని పనిచేయాలని, రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని, కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

 గ్రామంలోని విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ఇళ్ల మధ్య ఉన్నదని దాన్ని తొలగించే ప్రయత్నం చేయాలని  మధు కి టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు శ్రీనివాస రావు విజ్ఞప్తి చేశారు. వెంటనే ఈ సమస్యపై సంబంధిత అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేస్తానని చెప్పారు.  ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల పట్టణ అధ్యక్షులు రావూరి శ్రీనివాసరావు కనుమూరు వెంకటేశ్వరరావు మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తా రు నాగేశ్వరరావు, టిఆర్ఎస్ జిల్లా నాయకులు మొండితోక జయకర్, సోషల్ మీడియా నియోజకవర్గ ఇన్చార్జి తాళ్లూరి హరీష్ బాబు ,నల్లమల్ల శ్రీనివాసరావు, టిఆర్ఎస్ నాయకులు ఖాదర్,  తదితరులు పాల్గొన్నారు

Related posts

ఆందోళనలు అణచివేయడం తక్షణ అవసరం

Satyam NEWS

ఇష్యూ కంటిన్యూస్:హైకోర్టులో పిటిషన్ వేయనున్న పత్రి ట్రస్ట్

Satyam NEWS

ఆపత్కాలంలో ముందుకొచ్చి ఆదుకున్న రెడ్ క్రాస్ సొసైటీ

Satyam NEWS

Leave a Comment