కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో కార్తీక ద్వాదశి పర్వదినం సందర్భంగా భక్తులతో పోటెత్తింది. భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఆలయంలో ఏడు శనివారాలు 27 ప్రదక్షిణల కార్యక్రమం ఈరోజు మొదలవ్వడంతో ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనిస్థాయిలో ఆలయానికి ప్రవాహంలా భక్తులు వచ్చారు రద్దీని దృష్టిలో ఉంచుకుని ముందస్తు ఏర్పాట్లు చేశారు.
ఈరోజు ఒక్కరోజు 20 వేల మంది భక్తులు స్వామివారి ని దర్శించుకున్నట్టు అంచనా వేశారు. భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఈవో సాయిబాబు, చైర్ పర్సన్ దూడల విరీతదేవి,ట్రస్ట్ బోర్డు సభ్యులు ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనం అనంతరం భక్తులు అన్నప్రసాదశాల వద్ద కూడా అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు.2500 మంది భక్తులకు ఉచితంగా అన్నప్రసాదాన్ని అందచేసారు.