వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి శాంతియుతంగా జరుగుతున్న రాజధాని ఉద్యమాన్ని పక్కదోవ పట్టించేందుకే అక్కడికి వచ్చారని నరసరావుపేట నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు అన్నారు. ఎమ్మెల్యే అయి ఉండి రాజధాని రైతులకు న్యాయం చేయకపోగా లేనిపోని సంఘటనలతో రైతులను అయోమయంలోకి నెట్టేందుకు వైసిపి నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు.
కమిటీల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తున్నదని ఆయన అన్నారు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను అక్రమంగా అరెస్టు చేయడం వైసిపి ప్రభుత్వ కుట్రలో భాగమని ఆయన అన్నారు. ఇలాంటి విషయాలను నరసరావుపేట తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని డాక్టర్ చదలవాడ అన్నారు. రైతులను రెచ్చగొట్టే వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇలాంటి సంఘటనలు జరగకుండా రైతులను మేలు చేసే విధంగా వారి ఆలోచన ప్రవర్తన ఉండాలని ఆయన కోరారు.