గోల్నాక డివిజన్లోని ప్రతి ఒక్కరూ రేపు ఉదయం 9:00 గంటలకు కమలానగర్ కమిటీ హాల్ లో కంటి వెలుగు కార్యక్రమం జరుగుతుందని అవసరమైన వారు అందులో పాల్గొన్నాలని అంబర్పేట్ నియోజకవర్గం గోల్నాక డివిజన్ కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కంటికి సంబంధించిన ఏమైనా సమస్యలు ఉంటే డాక్టర్లు అక్కడ టెస్టులు చేసి అవసరమైతే కళ్ళజోడు అద్దాలు కూడా ఇస్తారని ప్రతి ఒక్కరు అవసరం ఉన్నవారికి తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా సోదర సోదరీమణులు అందరూ పాల్గొనవలసిందిగా కోరారు.
సత్యం న్యూస్, అంబర్పేట