28.7 C
Hyderabad
April 28, 2024 07: 45 AM
Slider విజయనగరం

రాష్ట్రంలో బీజేపీని మొద‌టి స్థానంలో పెట్ట‌డ‌మే అంద‌రి త‌క్ష‌ణ‌ క‌ర్త‌వ్యం

#reddypavani

బీజేపీని ఏపీలో అగ్ర స్థానంలో ఉంచడ‌మే మా అందరి ముందున్న ల‌క్ష్య‌మని బీజేపీ  విజ‌య‌న‌గ‌రం జిల్లా అధ్య‌క్షురాలు రెడ్డి పావ‌ని స్ప‌ష్టం చేసారు. ఏక‌త్మ‌తా భావ‌న‌…జాతీయ భావం ఈ రెండు ల‌క్ష్యాల‌తో  పార్టీని స్థాపించిన దీన ద‌యాళ ఉపాధ్యాయ ,డాక్ట‌ర్ శ్యాం ప్ర‌సాద్ ముఖ‌ర్జీ స్థాపించిన బీజేపీని గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు తీసుకెళ్ల‌డ‌మే మా అంద‌రి ముందున్న త‌క్ష‌ణ క‌ర్త‌వ్య‌మ‌ని రెడ్డి పావ‌ని అన్నారు.

పార్టీ వ్య‌వ‌స్థాప‌క దినోత్స‌వం సంద‌ర్బంగా విజ‌య‌న‌గ‌రం రింగ్ రోడ్ లో పార్టీ కార్యాల‌యంలో పార్టీ ప‌తాకాన్ని ఆవిష్క‌రించిన అనంత‌రం విలేఖ‌రుల‌తో కుసుమంచి సుబ్బారావుతో పాటు ఆమె మాట్లాడారు.ప్ర‌ధానంగా పార్టీని స్థాపించినదీనద‌యాళ్,డాక్ట‌ర్ శ్యాం ప్ర‌సాద్ ముఖ‌ర్జీ  త‌ర్వాత పార్ల‌మెంట్ లో రెండు సీట్లు ఉన్న‌పార్టీని…ఏకంగా దేశాన్ని న‌డిపి స్థాయికి తీసుకెళ్లిన వాజ్ పాయి,అద్వానీల‌ను త్యాగాల‌ను కూడా ప్ర‌తీ ఒక్క‌రూ గుర్తుంచుకోవాల‌న్నారు.

జ‌న సంఘ్ స‌మ‌యంలోవారిద్ద‌రూ బీజేపీగా మారిన త‌ర్వాత వీరిద్ద‌రూ పార్టీని న‌డిపించ‌డంలో కృష్ణార్జునులై ఉండి…న‌డిపించార‌ని  రెడ్డి పావ‌ని గుర్తు చేసారు.ప్రస్తుతం…కేంద్రంలో బీజేపీ… ప్రపంచాన్నే  శాసించే స్థాయికి  ఎదిగింద‌ని.,ప్ర‌స్తుతం కేంద్ర‌ప్ర‌భుత్వం అందిస్తున్న‌ఫ‌లాల‌ను గ్రామ‌స్థాయిలో ప్ర‌తీ ఒక్క‌రికీ అందించ‌డమే మ‌నంద‌రి  ముందు ఉన్న ప్ర‌ధాన ల‌క్ష్య‌మ‌ని రెడ్డి పావ‌ని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో కుసుమంచిసుబ్బారావుతో పాటు హ‌ర‌నాద్ త‌దిత‌రులు ఉన్నారు.

Related posts

మత్స్యకారుల కోసం ఎన్నో అభివృద్ధి పథకాలు అమలుచేస్తున్న ప్రభుత్వం

Satyam NEWS

నేరాలపై మహిళలు నిర్భయంగా ఫిర్యాదు చేయాలి

Satyam NEWS

ఇంటి వద్ద ఐఐటీ, నీట్ శిక్షణ, అధ్యాపకుల సమాచారం

Satyam NEWS

Leave a Comment