ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జరుగుతున్న పరిణామాలు, ప్రభుత్వం తమపై పెడుతున్న అక్రమ కేసులపై అమరావతి సాధన సమితి మహిళా జేఏసీ సభ్యులు గవర్నర్కు ఫిర్యాదు చేశారు. అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ మహిళలపై అక్రమ కేసులు నమోదు చేశారని వారన్నారు.
శాంతియుతంగా ధర్నాలు చేస్తుంటే వైసీపీ నేతలు దాడులు చేస్తున్నారన్నారు. బాపట్ల ఎంపి నందిగం సురేష్ తమపై తప్పుడు కేసులు పెట్టించి భయపెడుతున్నారని మహిళలు ఆరోపించారు.
తమపై పోలీసులు దాడికి పాల్పడిన ఫోటోలను గవర్నర్కు అందజేశామన్నారు. మొత్తం రాజధానిలో 2,800 మందిపై కేసులు పెట్టారని మహిళా జేఏసీ తెలిపింది.