31.2 C
Hyderabad
May 3, 2024 00: 31 AM
Slider ప్రత్యేకం

సీఎం జగన్‌‌తో ముఖేష్ అంబానీ భేటీ

Ambani Y S

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ సమావేశం అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీసులో జగన్‌ను ఆయన కలిశారు. ముఖేష్ అంబానీ వెంట ఆయన కుమారుడు అనంత్ అంబానీ, రాజ్యసభ ఎంపీ పరిమళ్ నత్వానీ కూడా ఉన్నారు.

రిలయన్స్ టాప్ మేనేజ్‌మెంట్‌లో పిరమళ్ నత్వానీ కూడా ఒకరు. ఏపీలో రిలయన్స్ పెట్టుబడులకు సంబంధించి వారి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది. అంతకు ముందు గన్నవరం విమానాశ్రయంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, మరికొందరు నేతలు ముఖేష్ అంబానీ, అనంత్ అంబానీకి స్వాగతం పలికారు. ముఖేష్, అనంత్ అంబానీలకు శాలువాలు కప్పిన విజయసాయిరెడ్డి జ్ఞాపికను బహూకరించారు.

Related posts

మరో ఆర్టీసీ కార్మికుడి ఆత్మహత్యాయత్నం

Satyam NEWS

అరుదైన శస్త్ర చికిత్సలో భారీ కణితి తొలగింపు

Satyam NEWS

రవితేజ డిస్కో రాజా తొలి సాంగ్ విడుదల

Satyam NEWS

Leave a Comment