కోర్టు చెప్పినా వినకుండా మొండిగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ చర్యలు ఎందరో ఆర్టీసీ కార్మికుల ప్రాణాలు తీస్తున్నాయి. తొర్రూరు ఆర్టీసీ డిపో లో మెకానిక్ గా పనిచేస్తున్న మేకల అశోక్ అనే ఆర్టీసీ కార్మికుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఎంతో విషాదకరమైన ఈ సంఘటనతో ఆ ప్రాంతంలోని ఆర్టీసీ కార్మికులు తీవ్ర దిగ్బ్రంతికి లోనయ్యారు. ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడ్డ మెకానిక్ అశోక్ పరిస్థితి విషమంగా ది. అతనిని స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు.
previous post