ఎల్లారెడ్డి పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో గురువారం వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించారు. సిర్గాపూర్ గ్రామానికి చెందిన మహబూబ్ బీ 65 సంవత్సరాల వయస్సు గల మహిళ కడుపునొప్పితో హాస్పిటల్లో చేరింది.
వైద్యులు పరీక్షలు నిర్వహించి కడుపులో కణితి ఉందని గుర్తించి వెంటనే 5 కేజీ ల కణితిని డాక్టర్ నాగేశ్వరరావు అరుదైన ఆపరేషన్ చేసి కణితిని తొలగించారు. ఈ సందర్భంగా మహిళ కుటుంబ సభ్యులు, ఆసుపత్రి సిబ్బంది వైద్యులను అభినందించారు.