అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన చోటుచేసుకుంది.చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలకు హాజరై తిరిగి వస్తున్నకొందరిపై దుండగులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. ఫ్లోరిడాలో శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ కాల్పుల్లో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో ఓ మైనర్ బాలుడు ఉన్నాడు.
పోలీసుల వివరాల ప్రకారం రివియెరా బీచ్ సమీపంలోని విక్టరీ సిటీ చర్చి వద్ద జరిగిన ఈ సంఘటనలో దిండగులు మొత్తం 15 రౌండ్ల కాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. దుండగుల కోసం ముమ్మర గాలింపు జరుగుతోంది. గాయపడ్డవారిని చికిత్స కి ఆసుపత్రికి తరలించగా వారి ఆరోగ్య పరిస్థితిపై ఇప్పటివరకు ఆస్పత్రి వర్గాలు ఎలాంటి హెల్త్ బులెటిన్ విడుదల చేయలేదు.