కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు కరోనా సోకింది. ఆయనకు కరోనా పాజిటీవ్ వచ్చినట్లు ఆయనే వెల్లడించారు. తనకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో పరీక్ష చేయించుకున్నానని ఆ పరీక్షలో కరోనా పాజిటీవ్ వచ్చిందని అమిత్ షా ట్విట్టర్ లో పేర్కొన్నారు.
పరీక్ష ఫలితం రావడంతో ఆయన వెంటనే ఐసోలేషన్ లోకి వెళ్లిపోయారు. దేశం మొత్తాన్ని ఊపేస్తున్న కరోనా దేశ హో మంత్రికే రావడం గమనార్హం.