నేడు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా అమితాబ్ రాష్ట్రపతి భవన్ లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా అమితాబ్ బచ్చన్ తన సంతోషాన్ని తెలియజేశారు. భారత ప్రభుత్వం అందించిన ఈ అవార్డుని తాను భాద్యతగా భావిస్తున్నట్లు తెలిపారు.
ఇండియన్ సినిమా పితామహుడు దాదాసాహెబ్ పేరిట ప్రభుత్వం ప్రతి ఏడాది ఒకరిని ఈ అవార్డుకు ఎంపిక చేస్తున్న సంగతి తెలిసిందే. ఆశా బోస్లే, లతా మంగేష్కర్, రాజ్ కపూర్, బాలచందర్ లాంటి సినీ దిగ్గజాలు ఈ అవార్డుని అందుకున్నారు. తెలుగులో ఇప్పటి వరకు బిఎన్ రెడ్డి, ఎల్వి ప్రసాద్, ఏఎన్నార్, రామానాయుడు, కె విశ్వనాథ్ లాంటి టాలీవుడ్ దిగ్గజాలు దాదా పురస్కారాన్ని అందుకున్నారు.