కరోనా కోరల నుంచి అమితాబ్ బచ్చన్ బయటపడ్డారు. ఆయనకు కరోనా నెగెటీవ్ వచ్చినట్లు ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ తెలిపారు. అమితాబ్ బచ్చన్ కరోనా బారిన పడి ముంబయిలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ పై పెద్ద వయసులో కూడా పోరాటం చేసి బయటకు రావచ్చునని అమితాబ్ బచ్చన్ నిరూపించారు.
అమితాబ్ బచ్చన్ కు కరోనా నెగెటీవ్ వచ్చినా ఆయన కుమారుడి కి మాత్రం ఇంకా పాజిటీవ్ వచ్చింది. అందువల్ల అభిషేక్ బచ్చన్ ఇంకా ఆసుపత్రిలోనే ఉండి చికిత్స చేయించుకుంటున్నారు. ఇటీవల అభిషేక్ బచ్చన్ భార్య ఐశ్వర్యా రాయ్, కుమార్తె ఆరాధ్య కరోనా నుంచి కోలుకుని ఇంటికి చేరుకున్న విషయం తెలిసిందే.