32.7 C
Hyderabad
April 27, 2024 00: 21 AM
Slider పశ్చిమగోదావరి

సొంత ఇంట్లో కాలిపోయి కనిపించిన ఇంజనీరింగ్ విద్యార్ధిని

పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం ముద్దాపురం గ్రామంలో ముళ్ళపూడి హారిక(19) అనే యువతి అనుమానాస్పద పరిస్థితిలో మృతి చెందింది. ముద్దాపురంలోని ఆమె నివాసం పై పోర్షన్ లో మంచంపై దేహం మొత్తం కాలిపోయి స్కెలిటన్ ఒక్కటే కనిపిస్తున్నట్లుగా ఉన్నది. సినీ పక్కీలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేయాలని స్థానికులు కోరుతున్నారు. హారిక తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లి వాసవీ ఇంజనీరింగ్ కళాశాలలో సెకండ్ ఇయర్ బి. టెక్ చదువుతున్నది. మొన్నటి వరకూ కళాశాలలో హాస్టల్ లో ఉంటూ చదువుకుని ఈ మధ్య ఇంటికి వచ్చి కాలేజ్ కు వెళుతున్నట్లు సమాచారం. మృతురాలి సవతి తల్లి ముళ్ళపూడి రూపా రాణి, తండ్రి శ్రీనివాస్ లపై బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నట్లుగా సమాచారం. సవతి తల్లి రూప తణుకు మండలం వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు గా ఇటీవలే ఎంపిక అయినట్లు తెలుస్తుంది. తండ్రి ముళ్ళపూడి శ్రీనుకు గతంలో తాడేపల్లిగూడెం మండలం కృష్ణాయపాలెంకు చెందిన వసంత కుమారి అనే మహిళతో వివాహం అయినట్లుగా తెలుస్తుంది. మొదటి భార్య వసంత కుమారి అనుమానాస్పద మృతిలో నిందితుడుగా శ్రీను ఉన్నాడు. ఇప్పుడు ఈ ఘటన చోటుచేసుకోవడం పై మొదటి భార్య బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శవ పంచనామా నిర్వహించారు. తణుకు రూరల్ పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

విజయనగరం లో సాయంత్రం పూట ట్రాఫిక్ ఇక్కట్లు…!

Satyam NEWS

పేదింట్లో కల్యాణలక్ష్మి కాంతులు తెలంగాణ ప్రత్యేకం

Satyam NEWS

ఇస్రో చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం

Satyam NEWS

Leave a Comment