ఆనందయ్యతో నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్బాబు నిర్వహించిన సమావేశం ముగిసింది.
అనంతరం కలెక్టర్ చక్రధర్బాబు మాట్లాడుతూ.. హైకోర్టు ఆదేశాల మేరకు ఆనందయ్య మందు పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామన్నారు.
పాజిటివ్ రోగులకిచ్చే మందు పంపిణీకి మొదట ప్రాధాన్యం ఇస్తామన్నారు. త్వరలో ఆన్లైన్ ద్వారా ఆనందయ్య మందు పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామన్నారు.
మందు తయారీకి కొన్ని రోజులు సమయం పడుతుందని... జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల నుంచి మందు కోసం ఎవరూ రావొద్దని చక్రధర్బాబు విజ్ఞప్తి చేశారు.