మెట్రో టీవీ యాజమాన్యం అత్యంత ఆకర్షణీయంగా రూపొందించిన 2021 క్యాలెండర్ ను మంగళవారం మాజీ ఐజీ, వైస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ ఆవిష్కరించారు.
అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలోని వైకాపా కార్యాలయంలో వైకాపా నేతలు గోపీకృష్ణ, లతీఫ్ సేట్, చిలమత్తూర్ మండల నేతలు జగన్మోహన్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, దేమకేతేపల్లి తిరుమలేష్, మెట్రో ఛానల్ హిందూపురం పార్లమెంట్ ఇంచార్జ్ ఎం.క్రిష్టప్ప, సీనియర్ జర్నలిస్ట్ మాలప్ప తదితరుల సమక్షంలో ఎమ్మెల్సీ నూతన క్యాలెండర్లను ఆవిష్కరణ గావించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇక్బాల్ మాట్లాడుతూ నిరంతరం… నిష్పక్షపాతంగా… వీక్షకులకు వార్తలు అందిస్తున్న “మెట్రో” న్యూస్ ఛానెల్ రూపొందించిన క్యాలెండర్ అద్భుతంగా ఉందన్నారు.
ఆంధ్ర, తెలంగాణా తోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వీక్షకులకు మెట్రో ఛానల్ మరింత దగ్గరకావాలని ఇక్బాల్ ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మెట్రో టీవీ యాజమాన్యానికి, టీవీ వీక్షకులకు శుభాకాంక్షలు తెలియజేశారు.