భారతదేశ స్వతంత్ర 75 సంవత్సరాల వజ్రోత్సవ వేడుకలు ములుగు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ తో పాటు ములుగు ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి సుధీర్ యాదవ్ కూడా ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఇంటింటికీ జాతీయ జెండాను పంపిణి కార్యక్రమం ప్రారంభించారు.
పండుగ వాతావరణంలో బాజాభజంత్రీలతో పట్టణంలోనీ వీధులలో పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఏక్బాల్, ఎంపీవో హనుమంత్, ఈవో మహేందర్, సర్పంచ్, వార్డు సభ్యులు అంగన్వాడి టీచర్లు గ్రామంలో యువకులు ప్రముఖులు గ్రామ పంచాయతీ సిబ్బంది వీరితో పాటు మెరుగు సంతోష్,అజారుద్దీన్, ఎనగందుల వెంకటేష్, మెరుగు నగేష్, వసీం అక్రమ్, ఓజ్జల కుమార్, ఓదెల శరత్, బొంతల వేణు, కవ్వంపల్లి బాబు, గుండాల నరసయ్య పాల్గొన్నారు.