ఆంధ్రభూమి ఎడిటర్, సీనియర్ జర్నలిస్ట్ దివంగత ముళ్ళపూడి సదాశివ శర్మ కుటుంబానికి ఆంధ్రభూమి – డెక్కన్ క్రానికల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆర్థిక సహాయం అందించింది. సిబ్బంది తమకు తోచిన విరాళం అందించి మొత్తం 2 లక్షల 6 వేల 520 రూపాయలు సేకరించారు.
అసోసియేషన్ సభ్యులు ఇవాళ మధ్యాహ్నం సదాశివ శర్మ ఇంటికి వచ్చి శర్మ సతీమణి లక్ష్మీ పద్మావతికి, కుమార్తె శ్రీవిద్య కు చెక్కులను అంద జేశారు. అసోసియేషన్ తరఫున జర్నలిస్టులు వెల్జాల చంద్రశేఖర్, పి.వీ.రమణా రావు, శివ తదితర నేతలు రాగా వారికి సీనియర్ జర్నలిస్టు విద్యారణ్య కామ్లేకర్ ధన్యవాదాలు తెలిపారు.