40.2 C
Hyderabad
April 29, 2024 16: 23 PM
Slider ఆధ్యాత్మికం

20 నుండి 24వ‌ సుంద‌రకాండ సర్గ శ్లోక అఖండ పారాయ‌ణ రేపు

Tirumala

కరోనా వైరస్ నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమ‌ల‌ నాద‌నీరాజ‌నం వేదిక‌పై నవంబరు 3వ తేదీ మంగళవారం 6వ విడ‌త‌ సుందరకాండ అఖండ పారాయణం నిర్వహించనున్నారు.

ఉద‌యం 7 గంటల నుండి సుందరకాండలోని 20వ సర్గ నుంచి 24వ సర్గ వరకు ఉన్న 185 శ్లోకాలను పారాయణం చేస్తారు. 

తిరుమల ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన పీఠం, తిరుప‌తిలోని వేద విశ్వవిద్యాలయం, సంస్కృత విశ్వవిద్యాలయం, వేదపారాయణదారులతో పాటు సుమారు 200 మంది ఈ అఖండ పారాయ‌ణంలో పాల్గొంటారు.

శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ఈ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తుంది.

ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా శ్రీ‌వారి భ‌క్తులు త‌మ ఇళ్ల‌లోనే ఈ పారాయ‌ణంలో పాల్గొని స్వామివారి కృప‌కు పాత్రులు కావాల‌ని కోర‌డ‌మైన‌ది.

ఇప్ప‌టివ‌ర‌కు ఐదు విడ‌త‌ల్లో అఖండ పారాయ‌ణం జ‌రిగింది.

Related posts

ఆనందయ్య మందులో హానికర పదార్ధాలు లేవు

Satyam NEWS

తొలి సారి రీపోలింగ్ లేకుండా మున్సిపల్ ఎన్నికల నిర్వహణ

Satyam NEWS

జైపూర్ ఫుట్ కేంద్రాన్ని సందర్శించిన మంత్రి కొప్పుల ఈశ్వర్

Satyam NEWS

Leave a Comment