సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ వేపలసింగారం గ్రామ సర్పంచ్ అన్నెం శిరీష కొండారెడ్డి మహిళా విశిష్ట కీర్తి పురస్కారం 2023 అవార్డును అందుకున్నారు. సోమవారం రాత్రి హైదరాబాదు నగరంలోని రవీంద్ర భారతిలో తార ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన మహిళా విశిష్ట పురస్కారం 2023వ,సంవత్సరం సేవనందిని అవార్డును రాష్ట్ర బిసి కమిషన్ చైర్మన్ వకులాపురం కృష్ణమోహన్,సినీనటి మంజూభార్గవి చేతులు మీదుగా శిరీష అందుకున్నారు.
ఈ సందర్భంగా శిరీష మాట్లాడుతూ గ్రామ పంచాయతీని అభివృద్ధి పథంలో నడిపించడంతో పాటు కరోనా సమయంలో 60 రోజుల పాటు గ్రామస్థుల సహాకారంతో నిరుపేద కుటుంబాలకు ఉచిత అన్నదానం,నిత్యావసర సరుకులు పంపిణి చేసిన సందర్భంగా సేవ నందిని అవార్డును అందజేసినట్టు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తార అకాడమీ సంస్థ చైర్మన్ సంకె రాజేష్,సినీ,టెలివిజన్ ప్రముఖులు రోజారమణి,వై.విజయ,శరోని లౌన్,రాగిణి,దివ్యవాణి,ప్రీతినిగమ్,ఢిల్లీ రాజేశ్వరి,పోతురాజు రమేష్ బాబు, శ్వేతాకిరణ్,పలువురు సినీ,టివి నటులు, నృత్య కాళాకారులు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్