మాజీ మంత్రి కొల్లు రవీంద్రను మరో కేసులో ఇరికించేందుకు రంగం సిద్ధం అయిందా? జరిగిన పరిణామాలు చూస్తుంటే అలానే అనిపిస్తున్నది.
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో నిందితుడైన వ్యక్తి తెలుగుదేశానికి సంబంధించిన వాడని ప్రాధమికంగా నిర్ధారించిన వైసీపీ నాయకులు, పోలీసులు ఆ దిశగా కొల్లు రవీంద్రకు నోటీసులు జారీ చేశారు.
ఏ ఆధారంతో నిందితుడు భవన నిర్మాణ కార్మికుడని, ఇసుక లేక హత్యాయత్నంకు పాల్పడ్డాడని మీరెలా చెప్పారంటూ పోలీసులు తనకు నోటీసు జారీ చేసినట్లు కొల్లు రవీంద్ర తెలిపారు.
అలాగే వైసీపీకి చెందిన శ్రీకాంత్ రెడ్డి, హోం మినిష్టర్ సుచరిత నిందితుడు టీడీపీ సానుభూతి పరుడంటూ ఆరోపించారని దీన్ని తాను ఖండించానని ఆయన తెలిపారు.
అదే విధంగా నిందితుడికీ, టీడీపీకీ ఎటువంటి సంబంధం లేదని పోలీసులకు వివరణ ఇచ్చినట్లు కొల్లు రవీంద్ర తెలిపారు.