39.2 C
Hyderabad
April 30, 2024 22: 40 PM
Slider నిజామాబాద్

దళిత మహిళపై దాడి.. మరో నలుగురి అరెస్ట్

ఈ నెల 4 వ తేదీన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఇసన్నపల్లి గ్రామంలో దళిత మహిళను వివస్త్రను చేసి దాడికి పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ నెల 9 న రామారెడ్డి పోలీసులు కేసు నమోదు చేయడంతో పాటు దాడికి పాల్పడిన ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. తాజాగా ఈ కేసులో మరొక నలుగురిని అరెస్ట్ చేసినట్టు కామారెడ్డి డిఎస్పీ ప్రకాష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కేసులో మాచారెడ్డి మండలం లక్ష్మీరావుల పల్లి గ్రామానికి చెందిన రేండ్ల రాజు, పుట్ట నర్సింలు, కాళ్ళ దేవయ్య, రేండ్ల రాజులను ఆదివారం అరెస్ట్ చేసి రిమాండుకు తరలించడం జరిగిందన్నారు. ఈ కేసు విచారణ ఇంకా కొనసాగుతుందని, కేసులో ఇంకా ప్రమేయమున్న విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి ఘటనలకు ఎవరు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

సత్యం న్యూస్, కామారెడ్డి

Related posts

బంగ్లాదేశ్ చర్యతో భారీగా పెరుగుతున్న బియ్యం ధరలు

Satyam NEWS

విశాఖలో మాజీ కార్పొరేటర్ భర్త ఆత్మహత్య

Satyam NEWS

సమగ్ర శిక్ష ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగుల జీతం ఎప్పుడు?

Satyam NEWS

Leave a Comment