జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ఎల్లారెడ్డి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఏర్పాటుచేసిన సైన్స్ ప్రదర్శనశాలలో విద్యార్థులు పలు ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి వెంకటేశం మాట్లాడుతూ రామన్ ఎఫెక్ట్ ఘనత సీవీ రామన్ దేనని, ఫిబ్రవరి 28 న జాతీయ సైన్సు దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నామని తెలిపారు.
ఈ ప్రదర్శన వల్ల విద్యార్థులలో శాస్త్రీయ భావనలు పెంపొందించే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుందని, గ్రామాల్లో ఇతర ప్రాంతాల్లో మూఢాచారాలు, గుడ్డి నమ్మకాలు వంటివి నమ్మకుండా ప్రతిదీ కూడా శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించాలని అన్నారు. విద్యార్థులు పలు స్టాళ్లలో తయారుచేసిన ప్రయోగాలను అభినందించారు. ఈ ప్రదర్శనలో స్థానిక ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.