నేరాలు చేసేందుకు వైసీపీలోకి వెళుతున్నారో, వైసీపీలో ఉంటే నేరాలు చెయవచ్చు అనుకుంటున్నారో తెలియదు కానీ వైసీపీ నాయకుడు మరొకరు హత్య కేసులో నిందితుడుగా మారాడు. చిత్తూరు జిల్లాలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. కురబలకోట మండలం ముదివేడు సమీపంలో ఈ దారుణం జరిగింది.
కొంగవారిపల్లికి చెందిన గాజుల వ్యాపారం చేసుకునే కే.రమణమ్మ(37) ఇలా హత్యకు గురైనట్లుగా పోలీసులు గుర్తించారు. ఇంటి స్థల వివాదం, ఆర్థిక పరమైన లావాదేవీలే హత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. రమణమ్మను హత్య చేసిన వ్యక్తి వైసీపీకి చెందిన రమణారెడ్డిగా పోలీసులు గుర్తించారు. ఇద్దరు ముగ్గురు కలిసి హత్య చేసినట్లుగా పోలీసులు విచారణలో వెల్లడైంది.