అందుకు నిదర్శనం…ముస్లిం విద్యార్ధిని మిస్బా ఆత్మహత్య…!
చిత్తూరు జిల్లా పలమనేరు లో ముస్లిం కు చెందిన మిస్బా ఆత్మహత్యకు జగన్ ప్రభుత్వమే కారణమని విజయనగరం జిల్లా టీడీపీ మైనార్టీ సెల్ ఆరోపించింది. ఈ మేరకు అశోక్ బంగ్లాలో టీడీపీ మైనార్టీ సెల్ అధ్యక్ష, కార్యదర్శులు… ఎన్.కే.ఎం బాష, ఎస్పీమ్ సిద్దిఖీలు అలాగే పార్టీ పార్లమెంట్ మహిళా ప్రధాన కార్యదర్శి అనురాధబేగంలు మాట్లాడారు. పలమనేరు ఘటనకు వైఎస్ఆర్పీపీ నే కారణమన్నారు. మైనార్టీ వర్గానికి చెందిన మిస్బా…. లెటర్ రాసి మరీ ఆత్మహత్యకు పాల్పడిందంటే…జగన్ ప్రభుత్వం అరాచం ఎలాం ఉందో విశిదమవుతోందన్నారు.
అదే స్కూల్లో అధికార పార్టీకి చెందిన సునీల్ కుమార్ కొడుకు కూడా…చదువుతున్నాడని… అయినా… మైనార్టీలపై ఆగడాలు ఆగలేదన్నారు. అస్సలు జగన్ ప్రభుత్వం లో పోలీసులు…ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వాళ్లు.. ఐపీసీ(ఇండియన్ పీనల్ కోడ్ ను పాటిస్తున్నారా.? లేక వైసీపీ విదానాలను అవలంబిస్తున్నారా అని నిలదీసారు కేసు నమోదైనప్పటికి….అధికార పార్టీ అండదండలంతో మైనార్టీ అమ్మాయికి అన్యాయం జరిగిందని టీడీపీ మైనార్టీ నేతలంతా వాపోయారు.
ఈ విషయంలో డిప్యూటీ సీఎం అంజాద్ బాష ఏం చేస్తున్నట్టు అని నిలదీసారు.మైనార్టీలసంక్షేమ కోసం…మీకు డిప్యూటీ సీఎం పదవిని కట్టబెడితే..మీరు మా సంక్షేమాన్ని…జగన్ కాళ్ల దగ్గర పెట్టారంటూ టీడీపీ మైనార్టీల నేతలు ధ్వజమెత్తారు. త్వరలో జగన్ పార్టీ ఆగడాలకు పుల్ స్టాప్ పెడతామని నేతలు హెచ్చరించారు.