అక్రమ ఆస్తులకు సంబంధించిన కేసులో సిబిఐ ప్రత్యేక కోర్టుకు ముఖ్యమంత్రి హోదాలో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తొలి సారిగా హాజరయ్యారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలు దేరిన ఆయన కొద్ది సేపటి కిందట బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి ఆయన సిబిఐ ప్రత్యేక కోర్టుకు వెళ్లారు. మధ్యాహ్నం రెండున్నర గంటల వరకూ ఆయన కోర్టులోనే ఉండాల్సి రావచ్చునని అంటున్నారు.
ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఇప్పటి వరకూ కోర్టుకు హాజరుకాలేదు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నందున కోర్టు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆయన కోరారు. అయితే కోర్టు అందుకు అనుమతించలేదు. దాంతో ఆయన కోర్టుకు హాజరు కావాల్సి వచ్చింది. ప్రత్యేక విమానంలో రావడం, పోవడం చేయడం కారణంగా ప్రతి శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వారానికి 60 లక్షల రూపాయలు ఖర్చు కానున్నది.