33.7 C
Hyderabad
April 29, 2024 00: 58 AM
Slider ప్రత్యేకం

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌

#APHighCourt

ఆంధ్రప్రదేశ్ లో జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలలో ఓట్ల లెక్కింపునకు రాష్ట్ర హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను ధర్మాసనం సమర్థించినట్లయింది.

గత ఏడాది ఏప్రిల్‌ 8న ఈ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల నిర్వహణలో నిబంధనలు పాటించలేదని.. ఎన్నికలు రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్‌ జడ్జి మే 21న తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఈ తీర్పును సవాలు చేస్తూ ఎస్‌ఈసీ, ఎన్నికల్లో పోటీ చేసిన కొందరు హైకోర్టులో అప్పీల్ చేశారు. వాటిపై ఆగస్టు 5న విచారణ జరిపిన ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. నేడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోస్వామి, జస్టిస్‌ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం ఈ తీర్పు వెల్లడించింది.

Related posts

కొడంగల్‌ నుంచి ఒక్కటే.. ఇల్లందులో 38 దరఖాస్తులు

Bhavani

తిరుమలేశుడి సన్నిధిలో సూపర్ స్టార్  

Murali Krishna

కరోనా వైరస్ ను తేలికగా తీసుకుంటున్నవారికి ఇది హెచ్చరిక

Satyam NEWS

Leave a Comment