సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని దగ్గుపాటి సుశీల రాజారత్నం (డి ఎస్ ఆర్) ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం మాజీ రాష్ట్రపతి ఏ పి జే అబ్దుల్ కలాం జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఏ పి జే అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం డి ఎస్ ఆర్ ట్రస్ట్ చైర్మన్ దగ్గుపాటి బాబురావు మాట్లాడుతూ దేశం గర్వించదగిన గొప్ప శాస్త్రజ్ఞుడు,యువతకు మార్గ నిర్దేశకుడు,మాతృదేశం కోసం జీవితాన్ని ధారపోసిన దేశభక్తుడు మాజీ రాష్ట్రపతి,భారతరత్న డా.ఏ పి జె అబ్దుల్ కలాం అని అన్నారు.భరతమాత ముద్దుబిడ్డ,గొప్ప మానవతావాది జీవితాంతం దేశంకోసం పరితపించిన మహనీయుడు డాక్టర్ ఏ పీ జే అబ్దుల్ కలాం అని,నిరాడంబర జీవనంతో తన జీవితాన్నే దేశానికి సందేశంగా చూపిన మహనీయుడని,కలాం చూపిన బాటలో పయనించడమే దేశానికి ఎనలేని సేవలు అందించిన ఆయన జీవితం నేటి యువతకు ఆదర్శమని,నేడు ఆ మహానుభావుడి జయంతి సందర్భంగా వారి సేవలను స్మరించుకుందామని,అదే వారికిచ్చే నిజమైన నివాళి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో డి ఎస్ ఆర్ ట్రస్ట్ సభ్యులు పొదిల తిరుపతి,పి ఎన్ ఆర్ పాశం నరసింహారావు,టైలర్ వెంకటనారాయణ, బి.చంటి, ముస్తఫా, వెంకన్న,ప్రవీణ్,బండ్ల గణేష్,ఈ.మనోహర్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్