భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు సోషల్ మీడియా నూతన రాష్ట్ర బాధ్యులను నియమించినట్లు భాజపా రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి పాలూరి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. భారతీయ జనతా పార్టీ సామాజిక మాధ్యమాల్లో విస్తరణే లక్ష్యంగా భాజపా సామాజిక మాధ్యమాల రాష్ట్ర ఇన్ఛార్జిగా, పార్టీ సీనియర్ నేత పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధనరెడ్డికి బాధ్యతను పార్టీ అప్పగించింది.
రాష్ట్ర కన్వీనర్గా విశాఖకు చెందిన భాజపా నాయకులు కేశవకాంత్ని నియమించారు. అలాగే నలుగురు కో కన్వీనర్లను, నలుగురు జోనల్ ఇన్ఛార్జులను, ముగ్గురిని రాష్ట్ర కమిటీ సభ్యులుగా నియమించారు. రానున్న రోజుల్లో ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్ష్టాగ్రాం, యూట్యూబ్, పార్టీ ప్రత్యేకంగా డిజిటల్ మాధ్యమంలో ఒక పత్రిక ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేసే అభివృద్ధి కార్యక్రమాలు, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, పార్టీ రాష్ట్రం లో చేసే కార్యక్రమాలను ప్రచారం చేయనున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఈ నూతన కమిటీకి ఈ నూతన బాధ్యతను అప్పజెప్పినట్లు శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు.