గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రానికి చెందిన దామ సత్యన్న, రామ కృష్ణ దంపతులు ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి అరకిలో వెండిని బుధవారం దేవాలయ చైర్మన్ ప్రహ్లాద రావు, సత్య చంద్రారెడ్డి ఆధ్వర్యంలో స్వామివారికి అందజేశారు. అంతకుముందు వారి దేవాలయంలో పంచామృతాభిషేకాలు, శివాలయంలో అభిషేకాలు నిర్వహించి స్వామివారి రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ చైర్మన్ వారికి ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో అర్చకులు మధుసూదనాచారి, తాటికుంట మధుసూదన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
previous post